ముంబై సమీపంలోని రిలయన్స్ కార్పొరేట్ పార్క్ సామూహిక వివాహాలకు వేదికైంది. ఈ కార్యక్రమంలో ముకేష్ అంబానీ, కొత్త జంటల తరఫున బంధువులు పాల్గొన్నారు. కోలాహలంగా కార్యక్రమం జరిగింది. అంతేకాకుండా కొత్త జంటలకు భారీగా కానుకలను అత్త నీతా అంబానీ, కోడలు అందజేశారు. బంగారు మంగళసూత్రం, ఉంగరాలు, ముక్కుపుడక, వెండి మెట్టెలు, పట్టీలు అందించారు. అలాగే పెళ్లి కుమార్తెకు రూ.1.01 లక్షల చెక్ అందించారు.