HYD: నార్సింగిలో వ్యాపారవేత్త కిడ్నాప్ కలకలం

69చూసినవారు
HYD: నార్సింగిలో వ్యాపారవేత్త కిడ్నాప్ కలకలం
HYD శివారు ప్రాంతం నార్సింగిలో ఓ వ్యాపారవేత్త కిడ్నాప్ కలకలం రేపుతోంది. అర్ధరాత్రి వ్యాపారవేత్త శిశువర్దన్ రెడ్డిపై రాయలసీమ గ్యాంగ్ దాడి చేసి కారులో బలవంతంగా కిడ్నాప్ చేశారంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన నార్సింగి పోలీస్.. సినీ ఫక్కీలో కిడ్నాపర్స్ ను చేజ్ చేసి పట్టుకున్నారు. హైదరాబాద్ నుండి కర్నూల్ కు తరలిస్తుండగా MBNR జిల్లా వద్ద పట్టుకున్నారు. ఆర్థిక లావాదేవులే కిడ్నాప్ కు కారణమని తేల్చారు. శిశువర్దన్ రెడ్డి సేఫ్ గా ఉన్నారు.

సంబంధిత పోస్ట్