కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో దివ్యాంగులకు 5% రిజర్వేషన్లు, నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని దివ్యాంగుల హక్కుల పోరాట నేత జగదీశ్వర్ రావు డిమాండ్ చేశారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల నుంచి చట్ట సభల వరకు రాజకీయ రిజర్వేషన్లు, రాజ్యసభ, ఎమ్మెల్సీ నామినేటెడ్ పదవులలో అన్ని పార్టీలు అవకాశం ఇవ్వాలన్నారు.