ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేశాం: కిషన్ రెడ్డి

76చూసినవారు
1980లో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించినప్పుడే 370 ఆర్టికల్ రద్దు చేస్తామని ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేశామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం బర్కత్ పురాలో బీజేపి ఆఫీసులో పార్టీ ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ. దేశంలో బూత్ స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు ఈ పండుగలను జరుపుకుంటున్నామన్నారు. మళ్ళీ కచ్చితంగా బీజేపీనే గెలుస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్