ప్రజలకు మద్దతుగా ఎంఐఎం కార్పొరేటర్ నిరసన

50చూసినవారు
బహదూర్ పురా పరిధిలోని మూసి పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలకు మద్దతుగా కిషన్ బాగ్ డివిజన్ ఎంఐఎం కార్పొరేటర్ హుస్సేనీ పాషా సోమవారం నిరసన చేపట్టారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలకు ఎంత భూమి ఉంటే అంత భూమిని ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2, 3 అంతస్తుల భవనానికి డబుల్ బెడ్ రూమ్ ఇవ్వడం సరికాదన్నారు. ప్రజలకు న్యాయం జరిగే వరకూ తాము పోరాడతామని స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్