వాటర్ లైన్ మరమ్మత్తు పనులను పరిశీలించిన కార్పొరేటర్

69చూసినవారు
మంచినీటి సరఫరా సమస్యలు లేకుండా చూస్తున్నామని కిషన్ బాగ్ డివిజన్ కార్పొరేటర్ హుస్సినీ పాషా అన్నారు. శనివారం డివిజన్ లోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న వాటర్ లైన్ మరమ్మత్తు పనులను పరిశీలించారు. మంచినీటిలో మురుగు నీరు కలుస్తోందని వస్తున్న ఫిర్యాదుల మేరకు ఈ మరమ్మత్తు పనులను చేపట్టినట్లు తెలిపారు. త్వరగా పనులను పూర్తి చేసి మంచినీటి సరఫరా జరిగేలా చూడాలని అధికారులను కార్పొరేటర్ కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్