పాతబస్తీలో వ్యక్తి ఆత్మహత్య

15266చూసినవారు
పాతబస్తీలో వ్యక్తి ఆత్మహత్య
ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన చాంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. కేశనగిరి గుట్టపై నివసించే రామచంద్రయ్య(45) మేస్త్రి పని చేస్తుంటాడు. అతడు మద్యానికి బానిసై కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్