దుకాణంలో రూ. 14. 5 లక్షలు చోరీ చేసిన యువకుడిని మీర్ చౌక్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి రూ. 14. 5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అస్సాం రాష్ట్రానికి చెందిన పంపన్ డోలే( 23) ఈ నెల 6వ తేదీన నూర్ఖాన్ బజార్ లోని ట్రాక్టర్ల స్పేర్ పార్ట్స్ దుకాణంలో నగదు చోరీ చేశాడు. దుకాణ యజమాని అహ్మద్ద్ హుస్సేన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని శుక్రవారం అరెస్ట్ చేశారు.