తెలంగాణలో బీజేపీ కొత్త శక్తిగా నిలుస్తుంది: కిషన్ రెడ్డి
నిన్న జరిగిన పోలింగ్ తో తెలంగాణలో బీజేపీ కొత్త శక్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదని కేంద్రమంత్రి, బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మంగళవారం అన్నారు. కేంద్ర నాయకత్వం అనేక రకాలుగా తమకు సహకరించిందన్నారు. తెలంగాణ అభివృద్ధికి నడ్డా నాయకత్వంలో బీజేపీ సంపూర్ణ సహకారం లభించిందని చెప్పారు. తెలంగాణ విమోచన దినోత్సవాలను ఏటా అధికారికంగా నిర్వహించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు.