ఇంకా అందని ఓటర్ స్లిప్పులు.. అధికారులపై ఓటర్లు ఆగ్రహం
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఓటర్లకు ఇప్పటికీ ఓటర్ స్లిప్పులు అందలేదు. ముఖ్యంగా ఉప్పల్, చార్మినార్, ఖైరతాబాద్, జవహర్ నగర్ తదితర ప్రాంతాల్లోని ఓటర్లు తమకు ఓటే స్లిప్పులు ఇవ్వలేదని పేర్కొన్నారు. రేపు ఓటింగ్ ఉన్న నేపథ్యంలో ఇప్పటివరకు ఓటర్ స్లిప్పులు అందకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంటింటికి వచ్చి అందిస్తామని చెప్పిన అధికారులపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.