హైదరాబాద్ లోని మధురానగర్, ఎస్ఆర్ నగర్లో చిట్టీల పేరుతో రూ.100 కోట్లు వసూలు చేసి పరారైన పుల్లయ్యను పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు బెంగళూరులో పుల్లయ్యను అరెస్టు చేసి హైదరాబాద్కు తరలించారు. అయితే మోసపోయిన బాధితులు దాదాపు 700 మందికి పైగా ఉన్నట్టు సమాచారం.