పాతబస్తీలో భారీగా పోలీసు బందోబస్తు

555చూసినవారు
రంజాన్ ఉపవాస దీక్షలో భాగంగా చివరి శుక్రవారం కావడంతో మైనార్టీ సోదరులు భారీగా ప్రార్థనలకు హాజరయ్యారు. పాతబస్తీలోని మక్కాతో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఇతర మసీదులు జనంతో కిక్కిరిసిపోయాయి. ముందు జాగ్రత్తగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తును కట్టుదిట్టం చేశారు. లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు స్పెషల్ టీమ్ లను రంగంలోకి దింపారు.

సంబంధిత పోస్ట్