ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టైన అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నకు కోర్టు ఏప్రిల్ 6 వరకు రిమాండ్ విధించింది. వారు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. దీంతో పోలీసులు వారిని ఆదివారం హైదరాబాద్ చంచల్ గూడ జైలుకు తరలించారు. ఈ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు ఇప్పటికే రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.