హైదరాబాద్ పార్లమెంట్ సీటును గెలిచి కెసీఆర్ కు గిఫ్ట్ ఇస్తాం

1109చూసినవారు
హైదరబాద్ పార్లమెంట్ సీటును గెలిచి మాజీ సీఎం కెసీఆర్ కు కానుకగా అందజేస్తామని హైదరాబాద్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం భాగ్యలక్ష్మి అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కెసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతామన్నారు. తనపై నమ్మకంతో పార్టీ టికెట్ కేటాయించినందుకు గెలిచి చూపిస్తానన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్