భక్తుల ఇంటికే భద్రాద్రి శ్రీ సీతారామ చంద్రుల కళ్యాణ తలంబ్రాలు పొందే అవకాశం ఉంది. ఈ మేరకు ఆర్టిసి లాజిస్టిక్స్ కేంద్రాల్లో రూ. 151 చెల్లిస్తే విశిస్టమైన రాములోరి తలంబ్రాలు పొందవచ్చని మంగళవారం హైదరాబాద్ లో ఆర్టిసి ఎండీ సజ్జనార్ తెలిపారు. తెలంగాణ బుకింగ్ కు సంభందించిన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సేవలను హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజలతో పాటు ఇతర జిల్లాల వారు కూడా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.