ప్రతి ఒక్కరూ ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవాలి: ఎమ్మేల్యే

54చూసినవారు
ఇంకుడు గుంతల ద్వారా భూగర్భ జలాలు పెరుగుతాయని కార్వాన్ ఎమ్మేల్యే కౌసర్ మొహియుద్దీన్ అన్నారు. శుక్రవారం టోలీచౌకి లోని కాకతీయ నగర్ పార్కులో 90 రోజుల ప్రత్యేక డ్రైవ్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. 90 రోజుల వ్యవధిలో సివరేజ్, డీ-సిల్డింగ్ పనులు ఇంకుడు గుంతల ఏర్పాట్లపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు ఇంకుడు గుంతను ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్