గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ ఆదివారం చికెన్, మటన్ షాపులు బంద్ పాటించనున్నాయి. రేపు మహావీర్ జయంతి సందర్భంగా జీహెచ్ఎంసీ పరిధిలోని కబేళాలు, మాంసం దుకాణాలను బంద్ చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా ఈ ఆదేశాలు అతిక్రమించి చికెన్, మటన్ షాపులను తెరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మున్సిపల్ సిబ్బందికి కావాల్సిన సహకారం అందించాలని అధికారులను ఆదేశించారు.