కూకట్పల్లి నియోజకవర్గం అల్లాపూర్ డివిజన్ పరిధిలోని అజీజ్ నగర్ లో శనివారం కార్పొరేటర్ సబీహా గౌసుద్దీన్ నూతనంగా 55 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న స్ర్టాం వాటర్ డ్రైన్, సిసి రోడ్డు పనులను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అజీజ్ నగర్, మెరాజ్ నగర్, పద్మావతి నగర్, సైడ్ త్రీ మీదుగా ప్రవహించే వర్షపు నీరు వల్ల చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలకు వర్షాకాలంలో ఇబ్బందికరంగా ఉండేది అన్నారు.