బాలుడి మృతదేహాన్ని బయటకు తీసిన సిబ్బంది

72చూసినవారు
బాలుడి మృతదేహాన్ని బయటకు తీసిన సిబ్బంది
కూకట్పల్లి పీఎస్ పరిధి శనివారం రంగధాముని చెరువు బావిలో పడి మృతి చెందిన బాలుడి మృతదేహాన్ని శనివారం పోలీసులు వెలికి తీశారు. బాలాజీ నగర్ లోని శాంతి భూషణ్ బ్లెస్డ్ హోమ్ సొసైటీలో నివసిస్తున్న సందీప్ (13) చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, డీఆర్ఎఫ్ సిబ్బంది మృతదేహం కోసం గాలించి వెలికి తీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్