మొక్కలు నాటిన బీజేపీ కార్పొరేటర్

57చూసినవారు
స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని చంద్రగిరి కాలనీ కమ్యూనిటీ హాల్ ప్రాంగణంలో కార్యక్రమాన్ని స్థానిక బీజేపీ కార్పొరేటర్ రాజ్యలక్ష్మి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మొక్కలను నాటారు. రానున్న 5 రోజుల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాంకీ దయానంద్, కమ్యూనిటీ ఆర్గనైజర్ రాములు, జవాన్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.