భగత్ సింగ్ కు భారతరత్న కేటాయించాలి: వీరబోయిన మహేష్

74చూసినవారు
భగత్ సింగ్ కు భారతరత్న కేటాయించాలి: వీరబోయిన మహేష్
ఏఐఎస్ఎఫ్ ఘట్కేసర్ మండల సమితి ఆధ్వర్యంలో భగత్ సింగ్ 117వ జయంతి సందర్బంగా అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్బంగా ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శి వీరబోయిన మహేష్ యాదవ్ మాట్లాడుతూ 23 సంవత్సరాల వయసులోనే భారత మాత దాస్య శృంఖలాల నుండి విడిపించడం కోసం ప్రాణ త్యాగం చేసి, ప్రతి భారతీయుడిలో విప్లవాగ్నిని రగిలించిన యోధుడు అని అన్నారు.

సంబంధిత పోస్ట్