"ఏక్ పేడ్ మాకే నామ్" కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ

78చూసినవారు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు "ఏక్ పేడ్ మాకే నామ్" కార్యక్రమంలో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ బుధవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబాన్ని పోషించడంలో, మంచి చెడు చూడడంలో తల్లి పాత్ర ఎంత గొప్పదో, మానవాళిని కాపాడే వృక్షాల పాత్ర కూడా అంతే గొప్పదని అన్నారు. ప్రతి కుటుంబం అమ్మ పేరుతో ఒక మొక్కను నాటి వాటిని సంరక్షించాలని పీఎం నరేంద్ర మోడీ పిలుపునిచ్చారన్నారు.

సంబంధిత పోస్ట్