మల్లారెడ్డిపై సంచలన ఆరోపణలు

3295చూసినవారు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డిపై మరోసారి భూ బాధితులు సంచలన ఆరోపణలు చేశారు. తమకు చెందిన 33 గుంటల భూమిని ఆయన భూమిలో కలుపుకొని భయభ్రాంతులకు గురి చేశారని బుధవారం వారు హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో మీడియాతో తెలిపారు. కోర్టు ఆర్డర్ ఉన్నా పట్టించుకోలేదని చెప్పారు. పోలీసుల ముందే చంపేస్తామని మల్లారెడ్డి బెదిరించారని తెలిపారు. భూమి డాక్యుమెంట్లు ఉన్నా అక్కడికి వెళ్లలేని పరిస్థితి సృష్టిస్తున్నారని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్