అదనపు కట్నం తీసుకు రాలేదని ఇంట్లోకి రానివ్వడం లేదని ఓ యువతి అత్తారింటి ముందు ఆందోళనకు దిగింది. ఘట్ కేసర్ ఎన్ఎఫ్సీ నగర్ రైల్వే గేటు సమీపంలో నివాసం ఉంటున్న విష్ణువర్ధన్ రెడ్డికి బీబీనగర్ మండలం బ్రాహ్మణపల్లికి చెందిన రాధికతో 2021 నవంబరులో వివాహం జరిగింది. వీరికి 2 సంవత్సరాల కూతురు ఉంది. అదనపు కట్నం తేలేదని ఇంట్లో నుంచి బయటకు గెంటేయడంతో ఇంటి ముందు ఆందోళనకు దిగింది.