తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకుని గాంధీ నగర్ డివిజన్ లోని వివేకా నగర్ హనుమాన్ దేవాలయాన్ని, రాంనగర్ లోని వెంకటేశ్వర దేవాలయాన్ని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకవర్గ ప్రజలకు తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. అందరు సంతోషంగా ఉండాలని పూజలు నిర్వహించినట్లు తెలిపారు