రజాకార్ సినిమాని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శనివారం సంధ్య థియేటర్ లో తిలకించారు. నిజాం నవాబ్ అరాచకాలను ప్రతిబింబిస్తూ రూపొందిన చిత్రం రజాకార్ మూవీని సంధ్య థియేటర్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బృందం తిలకించింది. తెలంగాణ స్వాతంత్య్రం కోసం నిజాం రాజు, ఖాసీం రజ్వీ రజాకార్ల వ్యవస్థపై తెలంగాణ ప్రజలు సాగించిన పోరాటాన్ని తెరకెక్కించిన ఈ చిత్రం సంచలనం సృష్టించింది.