ఈనెల 19న బైక్ ర్యాలీ: గౌతమ్ రావు

77చూసినవారు
ఈనెల 19న బైక్ ర్యాలీ: గౌతమ్ రావు
బార్కత్ పురాలోని బీజేపి హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కార్యాలయంలో సోమవారం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షుడు గౌతమ్ రావు పాల్గొని మాట్లాడారు. ఈనెల 19వ తేదిన నగరానికి విచ్చేస్తున్న కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇట్టి ర్యాలిని విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్