ఇది కరెక్ట్ కాదు.. తగిన చర్యలు తీసుకోవాలి

569చూసినవారు
హైదరాబాద్ నాంపల్లి సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో బోయిన్ పల్లికి చెందిన దగడ్ సాయి అనే వ్యక్తి తను చేసిన టిక్ టాక్ వీడియోలు అసభ్యంగా మార్ఫింగ్ చేసి సోషల్ వీడియో లో పోస్టింగ్
చేస్తున్నారని సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు. తన కుటుంబ సభ్యులతో చేసిన టిక్ టాక్ ను సోషల్ మీడియాలో అసభ్యకరంగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు వైరల్ చేస్తున్నారంటూ
సికింద్రాబాద్ యూత్ ఐయ్ కాన్ దగడ్ సాయి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కావాలనే తన పర్సనల్ ఇమేజ్ ను కొందరు డ్యామేజ్ చేస్తున్నారంటూ సైబర్ క్రైమ్ స్టేషన్ లో దగడ్ సాయి ఫిర్యాదు చేశాడు. దగడ్ సాయి నుండి ఫిర్యాదు స్వీకరించిన సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టిక్ టాక్ లో కొన్ని వీడియోలు వైరల్ చేయడం పట్ల ఎంతో మంది అమ్మాయిలు ఆవేదనకు గురవుతున్నారు అంటూ వాపోయిన దగడ్ సాయి.. ఇలాంటి వారి పై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్