కుత్బుల్లాపూర్ నియోజక వర్గం సూరారం డివిజన్ సూరారం లో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ భవన్ లో నిర్వహించిన బాబు జగ్జీవన్ రాం జయంతి వేడుకల కార్యక్రమానికి శుక్రవారం ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో అంచెలంచెలుగా ఎదుగుతూ భారతదేశంలో ఎన్నో సంస్కరణలు చేపడుతూ ఉప ప్రధానిగా స్థాయికి ఎదిగిన బాబు జగ్జీవన్ రామ్ ను ఆశయ సాధనకై అందరూ పని చేయాలన్నారు.