నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ శ్రీనివాస్ నగర్ కాలనీలో శ్రీ అభయాంజనేయ స్వామి టెంపుల్ వారు బ్రహ్మోత్సవ వేడుకల సందర్భంగా మంగళవారం నృత్య ప్రదర్శన చేయించారు. ఇందులో శ్రీకృష్ణ నిత్యాలయ జక్కా కృష్ణ శిష్యులు, వారి బృందం కూచిపూడి నాట్యం చేశారు. ఇందులో ఆలయ కమిటీ సభ్యులు సునీల్, ఆది, సురేష్, రాఘవేంద్రరావు, ఏవి రావు, పరుచూరి శ్రీనివాస్, మహిళా కమిటీ సభ్యులు , ఇతరులు పాల్గొన్నారు.