కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి దూలపల్లి లో శుక్రవారం వినాయక మండపం ఏర్పాటు చేస్తుండగా విద్యుదాఘాతం సంభవించి నవీన్ చారి దుర్మరణం చెందాడు. మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించి కేసు నమోదు చేసుకున్నారు. పెట్ బషీరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.