కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట డివిజన్ సంజయ్ పురి కాలనీలో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కేవలం బిఆర్ఎస్ తోనే సాధ్యమన్నారు. ఇప్పటికే మల్కాజ్గిరి నియోజకవర్గంలోని దాదాపు అన్ని నియోజకవర్గ ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ అభ్యర్థి లే అన్నారు.