కుత్బుల్లాపూర్: తండ్రి కొడుకుల పై వీధి కుక్కల దాడి

81చూసినవారు
కుత్బుల్లాపూర్: తండ్రి కొడుకుల పై వీధి కుక్కల దాడి
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేట్ లో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. పని మీద బయటకు వెళ్లిన కుమ్మరి మల్లయ్య కుమారుడిని తీసుకొని ఇంటికి వస్తుండగా వీధి కుక్కలు దాడి చేశాయి. నెల రోజుల క్రితం ఇదే గ్రామంలో బాలుడి పై కుక్కల దాడి మరవకముందే మరో సారి వీధి కుక్కల స్వైర విహారం చేయటం పై స్థానికులు మండిపడుతున్నారు.

సంబంధిత పోస్ట్