ఇంటర్ విద్యార్థులకు అలర్ట్

4227చూసినవారు
ఇంటర్ విద్యార్థులకు అలర్ట్
తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయని భావించే వారితో పాటు ఫెయిల్‌ అయిన వారికి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు ఇంటర్‌ బోర్డు హెడ్యూల్‌ విడుదల చేసింది. సప్లిమెంటరీ పరీక్షలు మే 24వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి. రోజుకు రెండు సెషన్ల చొప్పున పరీక్షలు జరుగుతాయి. మొదటి సెషన్‌ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్‌ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుంది. సప్లిమెంటరీ పరీక్షలు రాసేవారు ఏప్రిల్ 25 నుంచి అంటే రేపట్నుంచి ఫీజు చెల్లించాలి. మే 5వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు.

సంబంధిత పోస్ట్