ముత్యాలమ్మ ఆలయంపై దాడి.. కేటీఆర్ సీరియస్

50చూసినవారు
సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ ఆలయంపై జరిగిన దాడి తీవ్ర కలకలం రేపుతోంది. ఇలాంటి తెలివితక్కువ చర్యలు హైదరాబాద్ సహనశీలతకు మచ్చ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ దాడి చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత నెలరోజులుగా శాంతిభద్రతలు దిగజారుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని కేటీఆర్ తన 'X'లో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్