గడ్డి అన్నారం డివిజన్ పరిధిలోని ప్రియాదర్శిని పార్కును డివిజన్ బీజేపీ కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పార్కుకు వచ్చేవారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని కార్పొరేటర్ తెలిపారు. ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తీసుకురావాలన్నారు. అలాగే పార్కులో ఉచిత యోగ తరగతులు నిర్వహించడం సంతోషకర విషయమన్నారు.