నేను మంచి స్నేహితుడిని కోల్పోయా: బండారు దత్తాత్రేయ

55చూసినవారు
నేను మంచి స్నేహితుడిని కోల్పోయా: బండారు దత్తాత్రేయ
పత్రికాస్వేచ్ఛ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాటుడిన వ్యక్తి రామోజీ రావు అని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. 'రామోజీరావు మరణం తీవ్ర దుఃఖాన్ని కలిగించింది. ఆయన గొప్ప వ్యక్తి మాత్రమే శక్తి కూడా. మితభాషి.. సామాజిక మార్పునకు ఆయన చేసిన కృషి గొప్పది. తెలుగు భాష, సాహిత్యాభివృద్ధి కోసం ఈనాడు, ఈటీవీల ద్వారా విశేష కృషి చేశారు. పత్రికాస్వేచ్ఛ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పాటుపడ్డారు. నేను మంచి స్నేహితుడిని కోల్పోయా' అని అన్నారు.

సంబంధిత పోస్ట్