ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం.. 2019 పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కోసం భాజపా రూ.325 కోట్లు ఖర్చు చేయగా, కాంగ్రెస్ రూ.356 కోట్లు ఖర్చు చేసింది. ఈ మధ్య సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ల సంఖ్య పెరిగింది. ఇక వాళ్లకు ఇచ్చే ప్రత్యేక ఇంటర్వ్యూలను పార్టీలు అనుకూల ప్రచారానికి మాధ్యమాలుగా ఉపయోగిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రచారం లేకుండా గెలిచే పరిస్థితి లేదని పార్టీలు గట్టిగా నమ్ముతున్నాయి.