మసాలా కోసం వెళితే ఎత్తుకెళ్లి పెళ్లి చేశారు!

79చూసినవారు
మసాలా కోసం వెళితే ఎత్తుకెళ్లి పెళ్లి చేశారు!
బీహార్‌లో ఓ విచిత్ర సంఘటన జరిగింది. చికెన్ మసాలా కోసం షాప్‌కు వెళ్లిన యువకుడికి బలవంతంగా పెళ్లి చేశారు. సకుచా అనే గ్రామంలో ఈ ఘటన జరిగింది. సుమిత్ కుమార్ అనే వ్యక్తి షాపు దగ్గర ఉండగా, ఇంతలో గోపాల్ యాదవ్ అనే వ్యక్తి స్కార్పియోలో వచ్చి తుపాకీ చూపించి సుమిత్‌ను కిడ్నాప్ చేశాడు. సకుచా గ్రామానికి 100 కిలో మీటర్ల అవుతల ఉన్న పూర్నియాకు తీసుకెళ్లి గోపాల్ యాదవ్ కుమార్తెతో బలవంతంగా కొట్టి మరి పెళ్లి చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్