మరో మూడు మ్యాచ్‌లు గెలిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్

58చూసినవారు
మరో మూడు మ్యాచ్‌లు గెలిస్తే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు భారత్
బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ను 2-0 క్లీన్‌స్వీప్‌ చేయడంతో భారత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్(WTC) పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. ఈ WTCలో భారత్ ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడగా, అందులో 8 విజయాలు, 2 ఓటములు, ఒక డ్రా ఉన్నాయి. ప్రస్తుతం భారత జట్టు (PCT 74.27)తో టాప్‌లో ఉంది. ఇక జూన్‌లో జరగనున్న ఫైనల్‌కు ముందు టీమిండియా 8 టెస్టులు ఆడనుంది. ఇందులో మూడింట గెలిచినా నేరుగా ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్