చంపితే స్వర్గానికి పోతా : కేఏ పాల్

63చూసినవారు
చంపితే స్వర్గానికి పోతా : కేఏ పాల్
కేంద్రంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల పాలకవర్గాల ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేని వారు నన్ను చంపాలని చూస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను చంపితే స్వర్గానికి పోతానని, వారు మాత్రం నరకానికి పోతారన్నారు. గతంలో తనను చంపాలని అనుకున్న వారే చచ్చి పోయారని కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు భద్రత కల్పించాలని ప్రధాని మోడీ, అమిత్ షా‌లకు లేఖ రాశానని పాల్ తెలిపారు.

సంబంధిత పోస్ట్