పెట్రోల్ దాడి ఘటనపై స్పందించిన ఏపీ సీఎం

69చూసినవారు
పెట్రోల్ దాడి ఘటనపై స్పందించిన ఏపీ సీఎం
కడప జిల్లా బద్వేల్ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పందించారు. ఇంటర్ విద్యార్థిని చనిపోవడంపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన సత్వరం విచారణ పూర్తి చేసి, నిందితునికి మరణశిక్ష పడేలా చూడాలని కోరారు. ‘మహిళలు, ఆడ బిడ్డలపై అఘాయిత్యాలు చేసే వారికి ఈ ఘటనలో పడే శిక్ష ఒక హెచ్చరికలా ఉండాలి. ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ విధానంలో కేసు విచారణ పూర్తి చేయాలి‘ అని సీఎం అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్