శారదా పీఠానికి భూ కేటాయింపులు రద్దు

73చూసినవారు
శారదా పీఠానికి భూ కేటాయింపులు రద్దు
స్వరూపానందేంద్రంకు చెందిన శారదాపీఠానికి జగన్ ప్రభుత్వం కేటాయించిన 15 ఎకరాల భూమిని వెనక్కి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. భూకేటాయింపు రద్దు ప్రతిపాదనకు వచ్చే మంత్రివర్గ సమావేశం ఆమోదముద్ర వేయనుంది. భీమిలి పట్టణాన్ని ఆనుకుని కొత్తవలస గ్రామ పరిధిలో, సముద్ర తీరానికి దగ్గర్లో ఈ భూమి ఉంది. అక్రమ భూ కేటాయింపులపై సమీక్షలో భాగంగా ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని గుర్తించింది. శారదా పీఠానికి భూములు కేటాయింపును రద్దు చేయాలని నిర్ణయించింది.

సంబంధిత పోస్ట్