నైరుతి రుతుపవనాలపై IMD ప్రకటన

549చూసినవారు
నైరుతి రుతుపవనాలపై IMD ప్రకటన
నైరుతి రుతుపవనాలు మే 31న కేరళను తాకనున్నట్లు IMD అంచనా వేసింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1న దేశంలోకి ప్రవేశిస్తాయని IMD డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ తెలిపారు. మే 31 ముందస్తేం కాదని, సాధారణ తేదీనే అని చెప్పారు. కాగా జూన్, జులై మాసాలు భారత వ్యవసాయానికి అత్యంత ముఖ్యమైనవి. ఈ 2 నెలల్లో కురిసే వర్షాలపైనే రైతులు ఆధారపడతారు. ఈసారి సాధారణం కంటే అధికంగా వర్షాలు కురుస్తాయని IMD ఇప్పటికే తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్