పలు రాష్ట్రాల్లో వేడిగాలులకు అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, జార్ఖండ్, ఒడిశా, జమ్మూకశ్మీర్, చండీగఢ్లలో రాబోయే 5 రోజుల పాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావొచ్చని పేర్కొంది. అయితే, బెంగాల్, సిక్కిం, అసోం, మేఘాలయ, అరుణాచల్లో శుక్రవారం వరకు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిచే అవకాశం ఉంది. ఇక ఏపీ, మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక, గోవాలో సైతం అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.