పాకిస్తాన్ మాజీ ప్రధాని, పీటీఐ వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం జైలులో ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన లాయర్లను జైలులోనే ఒంటరిగా కలిసేందుకు ఇస్లామాబాద్ హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు జైలు నిర్వాహకులను కోర్టు ఆదేశించింది. ఇమ్రాన్, అతని న్యాయవాదులు కూడా పెన్సిల్స్, పేపర్లను అడియాలా జైలుకు తీసుకురావడానికి అనుమతించాలని కోర్టు ఆదేశించింది.