AP: ఒక్కరోజుకే తెగిపోయిన ఫ్లోటింగ్ బ్రిడ్జి

1544చూసినవారు
విశాఖ ఆర్కే బీచ్‌లో ఆదివారం ప్రారంభ‌మైన నీటిపై తేలే వంతెన(ఫ్లోటింగ్ బ్రిడ్జి) తెగిపోయింది. చివరి భాగం విడిపోయి కొద్దిదూరం కొట్టుకుపోయింది. అదృష్టవశాత్తు ఘ‌ట‌న స‌మయంలో ఎవ‌రు లేక‌పోవ‌డంతో పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది. ప్రస్తుతం ఫ్లోటింగ్‌ బ్రిడ్జి వైపు ప్రజలు వెళ్లకుండా భద్రత ఏర్పాటు చేశారు. ఈ ఫ్లోటింగ్‌ బ్రిడ్జిను ఆదివారం ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్