భారీ వర్షాల దృష్ట్యా ఏపీ, తెలంగాణలోని యూజర్లకు అదనంగా 4 రోజులు కాల్స్, డేటా అందించనున్న ఎయిర్‌టెల్‌

66చూసినవారు
భారీ వర్షాల దృష్ట్యా ఏపీ, తెలంగాణలోని యూజర్లకు అదనంగా 4 రోజులు కాల్స్, డేటా అందించనున్న ఎయిర్‌టెల్‌
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని యూజర్లకు టెలికాం సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ప్రీపెయిడ్ యూజర్లకు అదనంగా 4 రోజుల వ్యాలిడిటీ ఇస్తామని స్పష్టం చేసింది. అన్‌లిమిటెడ్ కాల్స్‌తోపాటు రోజుకు 1.5GB మొబైల్‌ డేటాను అందించనున్నట్లు పేర్కొంది. పోస్ట్‌పెయిడ్‌ యూజర్ల బిల్లు చెల్లింపునకు 7 రోజుల పాటు గడువు పొడిగించింది. ఇంటికి వైఫై కనెక్షన్ ఉన్న వారికి 4 రోజుల అదనపు వ్యాలిడిటీ కల్పించినట్లు ప్రకటించింది..

సంబంధిత పోస్ట్