విజయవాడలో పీకల్లోతు నీటిలో పసిపాపను పెట్టెలో పెట్టి సురక్షిత ప్రాంతానికి తరలించిన వరద బాధితులు

51చూసినవారు
వరద నీటిలో విజయవాడ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వరద ముంపునకు గురైన ప్రాంతంలో ఓ పసికందును పెట్టెలో పెట్టి తరలిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు పీకల్లోతు నీటిలో నడుస్తూ ఓ తొట్టెలో నెలల చిన్నారిని ఉంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. గత మూడు రోజులుగా విజయవాడ జలదిగ్బంధంలో ఉంది. దీంతో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులుగా మారారు.

సంబంధిత పోస్ట్