రిజర్వేషన్ల పెంపు.. హైకోర్టులో ఎదురుదెబ్బ

60చూసినవారు
రిజర్వేషన్ల పెంపు.. హైకోర్టులో ఎదురుదెబ్బ
బీహార్ ప్రభుత్వానికి పాట్నా హైకోర్టులో గురువారం ఎదురుదెబ్బ తగిలింది. రిజర్వేషన్ల పరిధిని 50 శాతం నుంచి 65 శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు రద్దు చేసింది. విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీ, ఈబీసీలతో పాటు ఇతర వెనుకబడిన తరగతుల వారికి 65 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా పాట్నా హైకోర్టు ఈ తీర్పునిచ్చింది.

సంబంధిత పోస్ట్